దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి? | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి?

Jun 24 2025 3:19 AM | Updated on Jun 24 2025 3:19 AM

దరఖాస

దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి?

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రీవెన్స్‌ జరుగుతున్న క్రమంలో కొద్దిసేపు ఆపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం వరకు శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి ఒక్కో అధికారిని వివరాలు అడిగారు. పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్న శాఖల వారిని పిలిచి ‘మీ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి.. మీరేం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని, ఇకపై పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు.

వెబ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..

ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి అడిగారు. కొన్ని మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడాల్సిన అవసరం రావడంతో అందరూ వెబ్‌ కాన్ఫరెన్స్‌లో ప్రజావాణి ముగిసే వరకు ఉన్నారు. ప్రజావాణిలో సమస్యలపై కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులు సమస్యలను పెండింగ్‌లో ఉంచడం సరికాదన్నారు. తమకు వచ్చిన వినతులను పరిశీలించి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోగా పరిష్కారం చూపాలని చెప్పారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ విషయం దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సూచించారు. అలాగే సమస్య ఏ స్థాయిలో పరిష్కార దిశలో ఉంది అనే విషయం ఆన్‌లైన్‌లో కనిపించేలా అప్‌డేట్‌ చేయాలని, ఏ అధికారి వద్ద ఫిర్యాదు ఆగిందో ఆ అధికారి పేరు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈవిషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 186 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రికార్డుల్లో మా భూమి ఎక్కించండి..

ధర్మారం గ్రామంలో మాకు వారసత్వంగా వచ్చిన ఎకరం 20 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో 38 గుంటలుగా నమోదైంది. ఇప్పటికి పలుమార్లు రికార్డు సరిచేయాలని తిరిగినా కాలేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని రికార్డులు సరిచేసి మిగిలిన 22 గుంటల భూమిని కూడా మా పేరుతో రికార్డుల్లో వచ్చే విధంగా చూడాలి. నా భర్త చనిపోయాడు. తిరగలేకపోతున్నా. అధికారులు దయచేసి న్యాయం చేయాలి.

– వజ్రమ్మ, ధర్మారం(నడికూడ)

అధికారులను ప్రశ్నించిన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

గ్రీవెన్స్‌లో వెబ్‌ కెమెరాలు చూస్తూ..

అర్జీలను పరిశీలించిన కలెక్టర్‌

నిర్లక్ష్యం వహిస్తే

సహించేది లేదని హెచ్చరిక

దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి?1
1/2

దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి?

దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి?2
2/2

దరఖాస్తులు పెండింగ్‌లో ఎందుకున్నాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement