
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు.
కానిస్టేబుల్కు అభినందన
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయిరాం గత వారం క్లాషిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అతి పెద్ద పరుగు పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్.. ఆయనను అభినందించి రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని, క్రీడల్లో రాణించే పోలీసుకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అదనపు డీసీపీ సురేశ్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్రాజ్ పాల్గొన్నారు.
మత్తుపదార్థాలకు
దూరంగా ఉండాలి
కాజీపేట రూరల్/మడికొండ: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై కాజీపేట దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ (వర్ధన్నపేట) బాలుర పాఠశాల, కళాశాలలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాలతో జరిగే అనర్థాలపై దర్గా పాఠశాల విద్యార్థులు నాటిక ప్రదర్శించగా.. డీసీపీ వారిని అభినందించి రూ.1,000 నగదు పురస్కారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్, హెడ్ కానిస్టేబుళ్లు జయరాజ్, రాంచందర్, కాజీపేట సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై లవన్కుమార్, స్కూల్ హెచ్ఎం ఎన్.ఎన్.ఎం.స్వామి, సెక్రటరీ కటుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసా
రూ.148.74 కోట్లు జమ
హన్మకొండ: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు మద్దతుగా నిలుస్తోందని హనుమకొండ జిల్లా వ్యవసా య అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వానాకాలం పంటల సాగుకు సోమవారం జిల్లాలో 14 మండలాలు, 163 గ్రామాలకు చెందిన 1,41,364 మంది రైతుల ఖాతాల్లో రూ.148.74 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
వరంగల్ రీజియన్కు ప్రాధాన్యం
హన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో వరంగల్ రీజియన్కు ప్రాధాన్యం దక్కింది. ఖమ్మంలో ఈనెల 21, 22 తేదీల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. సోమవారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. వరంగల్ రీజియన్కు చెందిన సీహెచ్.రాంచందర్(భూపాలపల్లి ఏడీసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బి.ఉపేంద్రచారి (వరంగల్–1 డిపో కండక్టర్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఎస్ఈగా శివలింగం
వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీబ్ల్యూఎంసీ) ఇన్చార్జ్ ఎస్ఈగా బి.మహేందర్ను నియమిస్తూ కమిషనర్ చాహత్ వాజ్ పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్చార్జ్ ఈనెలఖారుతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు

రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు

రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు