
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నందున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ కె.వాసంతి కోరారు. కొత్త విద్యాసంవత్సరంలో బడిబాటలో భాగంగా పరకాలలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ వాసంతి, ఆర్డీఓ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఈఓ వాసంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నందున విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి అవసరమైతే దాతల సహాయం తీసుకోవాలని ఉపాధ్యాయులను, పాఠశాలల అభివృద్ధి కమిటీలను కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ రమాదేవి, మాజీ కౌన్సిలర్ ఉమాదేవి, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు చక్రవర్తుల మధు, కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలి
నడికూడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ వాసంతి అన్నారు. బడిబాటలో భాగంగా.. శుక్రవారం మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ వాసంతి పాల్గొని విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసంతి
సాముహిక అక్షరాభ్యాసం చేయించిన డీఈఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య