● మృగశిర సందడి | - | Sakshi
Sakshi News home page

● మృగశిర సందడి

Jun 9 2025 8:04 AM | Updated on Jun 9 2025 8:04 AM

● మృగశిర సందడి

● మృగశిర సందడి

రోహిణి ముగిసి ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర ప్రారంభం రోజు చేపలు తినడం వల్ల వానాకాలంలో వచ్చే వ్యాధులు దూరమవుతాయని, గుండె జబ్బులు, అస్తమా వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందనేది ప్రజల నమ్మకం. ఈనేపథ్యంలో గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని ప్రధాన రోడ్ల వెంట చేపల విక్రయాలు జోరుగా సాగాయి. కొర్రమీను, రోహు, కట్ల, రవ్వ, బొమ్మె చేపలను ఎక్కువ మంది కొనుక్కుని వెళ్లారు. కొందరు ఏపీ నుంచి రొయ్యలు, ఇతర రకాల చేపలను ఆర్డర్‌పై తెప్పించుకున్నారు. కాగా.. చేపలు తిననివారు ఇంగువను చిన్న ముద్దలుగా చేసి మింగారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement