బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్రెడ్డి
వర్ధన్నపేట: రైతుల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని.. 16 రకాల పంటలకు మద్దతు ధర పెంచడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కడారిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ఎరువుల సబ్సిడీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఫసల్ బీమా యోజన, లేబర్ బీమా కార్డులు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ విధానాల కోసం, కిసాన్ విశిష్టత కార్డుల కోసం గ్రామ వ్యవసాయ అధికారుల వద్ద రైతులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
పే..ద్ద పనస!
నర్సంపేట: సాధారణంగా పనస కాయ 10 నుంచి 15 కిలోల మధ్య ఉంటుంది. కానీ.. చెన్నారావుపేట మండలం శంకరం తండా గ్రామంలో భూక్య శ్రీనివాస్ ఇంటి ఆవరణలో ఉన్న పనస చెట్టుకు ఓ కాయ 22 కిలోల బరువుతో ఉంది. జన్యుపరమైన మార్పిడి, వాతావరణంలోని మార్పుల కారణంగా అధిక బరువుగల పనస కాయలు కాస్తుంటాయని నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి గోపాల్రెడ్డి తెలిపారు.
మెరుగైన వైద్య సేవలందించాలి..
గీసుకొండ: జిల్లాలోని పల్లె దవాఖానల్లో వైద్యులు మెరుగైన సేవలందించి, ప్రభుత్వం నిర్ణయించిన వైద్య, ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ విషయంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలన్నారు. టీబీ నియంత్రణ అధికారి ఆచార్య, ఎయిడ్స్ విభాగం మేనేజర్ స్వప్న మాధురి, డిప్యూటీ డెమో అనిల్కుమార్, డీఎండీఓ కమలాకర్, హెచ్ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా హెచ్ఐవీ, ఎస్టీఐల గురించి ప్రచారం చేయడానికి మొబైల్ ఎల్ఈడీ స్క్రీన్ వాహనాన్ని ప్రారంభించారు.
క్రీడలతో ఉద్యోగావకాశాలు
రాయపర్తి: క్రీడలు దేహదారుఢ్యంతోపాటు ఉద్యోగావకాశాలకు దోహదపడతాయని జిల్లా క్రీడల అధికారి(డీవైఎస్ఓ) సత్యవాణి అన్నా రు. గురువారం మండలంలోని కాట్రపల్లి, తి ర్మలాయపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వార్షిక వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో సెల్ఫోన్లు విని యోగించకుండా,బావుల్లో ఈతలకు వెళ్లకుండా సమయాన్ని క్రీడలపై దృష్టి సారించడం సంతో షకరమన్నారు. క్రీడల్లో వచ్చిన సర్టిఫికెట్లు ఉ ద్యోగావకాశాలకు ఉపయోగపడతాయన్నారు. సందర్భంగా ట్రైనర్లు ఉపాధ్యాయులు పుట్ట సమ్మయ్య, శ్రీనివాస్ను అభినందించారు.
మాల్దీవుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన
న్యూశాయంపేట : ప్రభుత్వ పథకాల అమలు, ఆడిట్, అభివృద్ధి కార్యకలాపాల తీరును పరిశీలించేందుకు వచ్చిన మాల్దీవుల అధ్యయన బృందం పర్యటన గురువారం ముగిసింది. బృందంలోని 30మంది సభ్యులు వరంగల్ జిల్లాలోని జెడ్పీ, డీఆర్డీఓ కార్యాలయాలు, గీసుకొండ మండలంలోని మరియపురం, వర్ధన్నపేట మండలాలను మూడ్రోజుల పాటు సందర్శించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చివరి రోజు కలెక్టర్ను కలిసి పర్యటన వివరాలను తెలిపి సంతృప్తి వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం