విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

Jun 1 2025 1:04 AM | Updated on Jun 1 2025 1:04 AM

విదేశ

విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్‌సిస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్‌ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌, ప్రాన్స్‌, జపాన్‌, సౌత్‌కొరియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ దేశాల్లో పీజీ, పోస్ట్‌ డాక్టరోల్‌ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

లైంగిక వేధింపుల

ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

వీబీ.నిర్మలా గీతాంబ

వరంగల్‌ లీగల్‌: లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయని వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ప్రోష్‌ యాక్ట్‌ –2013’ చట్టంపై జిల్లాల ప్యానెల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లకు వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థలు సంయుక్తంగా శని వారం అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా హనుమకొండ ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవితో కలిసి ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, పరిష్కారానికి చట్టా లు ఉన్నాయని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు న్యాయ సహాయం ఎలా పొందాలి, ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయమూర్తులు రితిక, ఫరీనా అహ్మ, డాక్టర్‌ అనితారెడ్డి వివరించారు. కార్యక్రమంలో వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు ఎం.సాయికుమార్‌, క్షమాదేశ్‌ పాండే, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.సుధఋర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో

వేగం పెంచాలి

హనుమకొండ కలెక్టర్‌ పి.ప్రావీణ్య

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పి.ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్‌ సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్‌ యువ వికాసం, తదితర అంశాలపై అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్‌ వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాలరాజు, నగర కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్‌ వైవీ.గణేష్‌, ఆర్డీఓ కె.నారాయణ, డీపీఓ లక్ష్మి రమాకాంత్‌, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ జి.రవీందర్‌తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై

ముందస్తు ప్రణాళికలు

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

ఎంజీఎం: వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, మలేరియా నోడల్‌ పర్సన్స్‌, హెల్త్‌ అసిస్టెంట్లతో శనివారం సమీక్షా సమావేశఽం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ విభాగాలతో కలిసి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌, వైద్యుడు నరేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

విదేశాల్లో విద్యకు  దరఖాస్తుల ఆహ్వానం1
1/1

విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement