నర్సంపేటలో ఫ్లాగ్‌ మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

నర్సంపేటలో ఫ్లాగ్‌ మార్చ్‌

Jun 4 2025 1:08 AM | Updated on Jun 4 2025 1:08 AM

నర్సంపేటలో ఫ్లాగ్‌ మార్చ్‌

నర్సంపేటలో ఫ్లాగ్‌ మార్చ్‌

నర్సంపేట రూరల్‌: నర్సంపేట పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌లో భద్రతా బలగాలతో (ఆర్‌ఏఎఫ్‌) ఫ్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, టౌన్‌ సీఐ ఎల్‌. రఘుపతిరెడ్డిలు ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి అంగడి సెంటర్‌, బస్టాండ్‌, వరంగల్‌ రోడ్డు జంక్సన్‌ మీదుగా నర్సంపేట మున్సిపాలిటీ, అంబేడ్కర్‌ సెంటర్‌, పాకాల్‌ సెంటర్‌ మీదుగా పోలీస్‌ స్టేషన్‌ వరకు మార్చ్‌ కొనసాగింది. కార్యక్రమంలో నర్సంపేట ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది, భద్రతా బలగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పరిధిలో ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్‌లోని సీసీఆర్‌బీ విభాగంలో పనిచేస్తున్న ఎస్‌.రాజేందర్‌ను రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న శ్రవణ్‌కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు.

సీజనల్‌ వ్యాధులపై

అప్రమత్తంగా ఉండాలి

డీఎంహెచ్‌ఓ సాంబశివరావు

సంగెం: వర్షాకాలంలో గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాధికారి సాంబశివరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆశ డేను పురస్కరించుకుని సంగెం గ్రామీణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి ఎయిడ్స్‌, టీబీ, క్షయ నివారణపై పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండ పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమయాపాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఆచార్య, వైద్యాధికారి వంశీకృష్ణ, డాక్టర్‌ దేవేందర్‌, డెమో అనిల్‌కుమార్‌, పల్లె దవాఖానా డాక్టర్లు శివరాజ్‌, క్రాంతి, లావణ్య, రాకేష్‌, సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.

ఎంజీఎంలో

డ్రగ్‌ అధికారుల తనిఖీలు

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలోని రక్త నిధి కేంద్రంలో సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌ పరికరం అనుమతుల కోసం మంగళవారం రాష్ట్ర స్థాయి అధికా రులతో పాటు జిల్లా డ్రగ్‌ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా పరికరం పనిచేయడానికి కావాల్సిన అనుమతులు పరిశీలించడంతో పాటు రక్త నిధి కేంద్రంలో ఉన్న రక్త నిల్వలు, పాటించాల్సిన నియమ నిబంధనలు పరిశీలించి పలు సూచనలిచ్చారు.

పిల్లలను ప్రభుత్వ

బడిలోనే చేర్పించాలి

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, బడిఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్‌ కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార జాతాను డీఈఓ తన కార్యాలయం వద్ద మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ విద్యపై విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయలపైన ఉందన్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నట్లు చెప్రాఉ. కార్యక్రమంలోటీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు కిరణ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు తాటికాయల కు మార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్‌ప్రసాద్‌రావు, బాధ్యులు దామోదర్‌, అన్నాదేవి, ఎస్‌ఎ రవూఫ్‌, పాక శ్రీనివాస్‌, రమేష్‌, కుమారస్వామి, రవీందర్‌, గుండు కరుణాకర్‌, రేణుక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement