నదీతీరం.. శోకసంద్రం | - | Sakshi
Sakshi News home page

నదీతీరం.. శోకసంద్రం

Jun 8 2025 1:52 AM | Updated on Jun 8 2025 1:52 AM

నదీతీ

నదీతీరం.. శోకసంద్రం

కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విష యం తెలియక మోకాళ్ల లోతు నీటిలో ఆడుకుంటుండగా.. ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతడిని కాపాడబోయి మరొ కరు.. ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాదం అలుముకుంది.

అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు..

రాత్రి 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ‘ఆపద మిత్ర’ గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపేశారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించనున్నారు. కాగా.. కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది.

ఐదు కుటుంబాల్లో విషాదం...

పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది.

బిడ్డల కోసం ఎదురుచూస్తూ...

గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండడం స్థానికులను కలచివేసింది.

అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే..

ఈతకు వెళ్లిన వారిలో అంబట్‌పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్‌, శివమనోజ్‌ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి.

మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:50 వరకు సాగిన గాలింపు..

లభించని ఆచూకీ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

మహదేవపూర్‌ మండలం

అంబట్‌పల్లిలో విషాదం

నేను సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి)

స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తర్వాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్‌ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేను భయపడి ఒడ్డుకు చేరుకున్నా.

నదీతీరం.. శోకసంద్రం1
1/3

నదీతీరం.. శోకసంద్రం

నదీతీరం.. శోకసంద్రం2
2/3

నదీతీరం.. శోకసంద్రం

నదీతీరం.. శోకసంద్రం3
3/3

నదీతీరం.. శోకసంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement