
విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
వర్ధన్నపేట: మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో గురువారం డిస్ట్రిక్ట్ సీడ్ స్క్వాడ్, వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా షాపుల్లోని సరుకు నాణ్యత ప్రమాణాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈతనిఖీల్లో భాగంగా.. కొన్ని విత్తన ప్యాకెట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటి శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. షాపుల నిర్వాహకులు ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మినట్లయితే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ బోర్డు తప్పనిసరిగా పకడ్బందీగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు కూడా నాసిరకం విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ విజయభాస్కర్, అధికారులు రంజిత్, విజయ్కుమార్, ఎస్సై చందర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.