
ఇంటర్లో 1,445 అడ్మిషన్లు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం అధ్యాపకులు చేపట్టిన ఇంటింటి ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. సోమవారం పలు గ్రామాల్లో అధ్యాపకులు పర్యటించి.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను వివరించారు. జిల్లాలో ఇంటింటి ప్రచారంతో ఇప్పటి వరకు 1,445 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు.
1,71,405 మంది ఖాతాల్లో రూ.196.49కోట్లు జమ
వనపర్తి: రైతుభరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలోని 1,71,405 మంది రైతుల ఖాతాల్లో రూ.196.49 కోట్లు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవిందు నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 3,27,492 ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందిందని.. మిగిలిన రైతులందరి ఖాతాల్లో మంగళవారం సాయంత్రంలోగా రైతుభరోసా నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని 43 రైతువేదికల వద్ద రైతుల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడతారన్నారు. రైతులందరూ కోలాహలంగా రైతువేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీఏఓ కోరారు.
జానియర్ సివిల్కోర్టు న్యాయమూర్తిగా శిరీష
ఆత్మకూర్: పట్టణంలోని జూనియర్ సివిల్కోర్డు న్యాయమూర్తిగా సోమవారం శిరీష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, న్యాయవాదులు ముక్తేశ్వర్, తిప్పారెడ్డి, నారాయణగౌడ్, రామేశ్వర్రెడ్డి, శంకర్లింగం, అశోక్, రామచందర్ తదితరులు న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంటర్లో 1,445 అడ్మిషన్లు