
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఖిల్లాఘనపురం/కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఖిల్లాఘనపురంలోని పద్మశాలి కల్యాణ మండపంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, హౌసింగ్ డీఈ విఠోభాతో కలిసి అలాగే పెద్దమందడి, శ్రీరంగాపురం, పెబ్బేరులోని ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదోడి సొంతింటి కళ కలగానే మిగిలిందన్నారు. ఏడాదికి అయిదు ఇళ్లు ఇచ్చినా నేడు ఈ పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వనపర్తిని పూరి గుడిసే లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత చీర, పంచె, పసుపు, కుంకుమతో ఇళ్లకు వస్తామన్నారు. ఖిల్లాఘనపురం గణపసముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడటానికి శుక్రవారం అధికారులు వస్తారని.. అన్ని విషయాలు మాట్లాడుకోవాలని సూచించారు. త్వరలో జరిగే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. అలాగే పెబ్బేరులో రుక్సానాబేగం ఇంటిని ముగ్గు వేసి ప్రారంభించారు. ఖిల్లా ఘనపురంలో జరిగిన కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ వెంకటాచారి, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీ సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రావు, పెబ్బేరు, శ్రీరంగాపురంలో జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, విండో చైర్మన్ జగన్నాథంనాయుడు, తహసీల్దార్లు మురళిగౌడ్, రాజు, ఎంపీడీఓ రవీంద్ర, రవినారాయణ, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేష్సాగర్ తదితరులు పాల్గొన్నారు.