
నాటి నుంచి విద్యాపర్తిగా..
సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తికి విద్యాపర్తిగా పేరుంది. గద్వాల, అయిజ తదితర ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు. నాటి నుంచి డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలో కొత్తగా జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్ కళాశాలలు, రెండో ఫిషరీష్ కళాశాల ఏర్పాటు విద్యపరంగా జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయా కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వేలాది మంది విద్యార్థులు జిల్లాకు తరలివస్తుండగా.. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయడంతో పాటు తగిన వసతులు కల్పించింది.