
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ కళాశాలను మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్లో గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు వలన పాలమూరు జిల్లా విద్యారంగంలో మరింత పురోగతి సాధించగలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), జి.మధుసూదన్రెడ్డి (దేవరకద్ర), జనంపల్లి అనిరుధ్రెడ్డి (జడ్చర్ల), వాకిటి శ్రీహరి (మక్తల్), చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట), తూడి మేఘారెడ్డి (వనపర్తి), వీర్లపల్లి శంకర్ (షాద్నగర్) ఉన్నారు.
– స్టేషన్ మహబూబ్నగర్