
సాగని పనులు.. పారని నీరు
నిలిచిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు
కొల్లాపూర్: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. భూ సేకరణ సమస్య కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కాల్వ నిర్మాణంపై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని భావిస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి.
● మూడేళ్ల కిందటరూ.147.7 కోట్లు మంజూరు
● భూ సేకరణే ప్రధాన అడ్డంకి
● నిర్మాణం పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు