
ప్రశాంతంగా జీపీఓ ఎంపిక పరీక్ష
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన గ్రామ పరిపాలన అధికారుల ఎంపిక పరీక్ష సజావుగా జరిగిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 97 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 90 మంది హాజరుకాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీచేసి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జవాబు పత్రాలను స్పెషల్ మెస్సెంజర్ ద్వారా ఎస్కార్ట్తో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్కు చేరవేయాలని లైజన్ అధికారి భానుప్రసాద్ను ఆదేశించారు. ఆయన వెంట పరీక్ష నిర్వహణ నోడల్ అధికారి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ నోడల్ అధికారి సుబ్రమణ్యం, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గురురాజ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, అర్ఐ మధు, అబ్జర్వర్ సుధీర్రెడ్డి ఉన్నారు.