వింతవ్యాధితో లక్షకు పైగా కోళ్లు మృతి
నెల్లిమర్ల: చంపావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం, మొయిద గ్రామాలకు వెళ్లే రహదారుల్లో చంపావతినదిపై ఉన్న వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఇసుక తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఇలాగే కొనసాగితే వంతెనలు, తాగునీటి పథకాలకు ముప్పుతప్పదని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమతవ్వకాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.


