చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

Jul 17 2025 3:13 AM | Updated on Jul 17 2025 3:13 AM

చికెన

చికెన్‌

బ్రాయిలర్‌ లైవ్‌ డెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ90 శ్రీ150 శ్రీ160

సర్వజన ఆస్పత్రిలో ఎస్టీ సెల్‌ ఏర్పాటు

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బుధవారం ఎస్టీ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ విబాగాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. జీవనరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకర్‌ రావు ఆదేశాల మేరకు ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సెల్‌లో ఒక డాక్టర్‌, ఇద్దరు హెల్త్‌ సూపర్‌ వైజర్లు, ముగ్గురు ఏఎన్‌ఎంలు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇక్కడికి వచ్చే గిరిజనులకు అవసరమైన సహాయాన్ని వారు అందిస్తారన్నారు.

14మంది జూదరుల అరెస్టు

బొండపల్లి: మండలంలోని వెదురువాడ గ్రామం వద్ద జూదం ఆడుతుండగా 14మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై యు.మహేష్‌ తెలిపారు. వారి నుంచి రూ.లక్షా 1170 నగదు, 9సెల్‌ఫోన్‌లు, 14మోటార్‌ సైకిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామన్నారు. పట్టుకున్న వారి పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

విద్యుత్‌ స్టేవైరు తగిలి గేదె మృతి

సీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇళ్ల సర్వీసుల నిమిత్తం విద్యుత్‌ స్తంభానికి సపోర్టుగా వేసిన విద్యుత్‌ స్టే వైరు తగిలి రూ.80వేల ఖరీదైన గేదె మృతిచెందింది. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాడి రైతు గుంట్రెడ్డి అప్పలనాయుడికి చెందిన గేదెను మేతకు తోలి ఇంటికి తీసుకువచ్చి ఇంటి ముందున్న తాడుకు కట్టాడు. వర్షం కురుస్తున్న సందర్భంగా నేల నాని పోవడంతో పక్కేనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి బిగించిన స్టేవైరుకు పింగాణీ లేక పోవడంతో స్టే వైరుకు ప్రవహించిన విద్యుత్‌ గేదె మెడ, కొమ్ముకు తగలడంతో మృతిచెందినట్లు తెలియ జేశారు.

గుర్తు తెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

బాడంగి: మండలంలోని ముగడ పంచాయతీ పరిధి విమానాశ్రయం రన్‌వే గచ్చు తుప్పల్లో కుళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం కనుగొన్నారు. ఈ విషయాన్ని వీఆర్‌ఓ ద్వారా పోలీసులకు సమాచార మివ్వగా ఎస్సై తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశిలించి మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కుళ్లిపోయి కపాలం, ఎముకలు బయటకు కనిపించడంతో ఆ వ్యక్తి సుమారు 15రోజులక్రితమే చనిపోయి ఉంటాడని, ఆయన వయస్సు సుమారు 50–55మధ్య ఉంటుందని అంచనాకు వచ్చారు. తొలుత ఆనుమానాస్పద మృతిగా భావించి విజయనగరం నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి పరిశీలించగా మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వారు కూడా చేసేది లేక తిరుగుముఖంపట్టారు. మృతదేహాన్ని ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లలేని పరిస్థితుల్లో ఆక్కడికే స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారి నాగేశ్వరావును రప్పించి పోస్టుమార్టం చేయించి సమీపంలోనే జేసీబీతో గొయ్యితీసి పూడ్చిపెట్టారు. అయితే కొద్దరోజులక్రితం మతిస్థిమితం లేని బిచ్చగాడు ఇటువైపు తిరుగుతుండేవాడని పలువురు చెప్పగా అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్‌1
1/3

చికెన్‌

చికెన్‌2
2/3

చికెన్‌

చికెన్‌3
3/3

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement