
పది మందిపై అట్రాసిటీ కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామానికి చెందిన అడ్డూరి అర్జునతో పాటు మరో 10 మందిపై దెందేరు గ్రామానికి చెందిన మొయ్య పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అడ్డూరివానిపాలెం గ్రామ సమీపంలో గల రాయల్మింజ్ లేఅవుట్లో తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన సేనాపతి కొండలరావుకు చెందిన స్థలంలో పెంటయ్య కొద్ది కాలంగా వాచ్మన్గా పని చేస్తున్నాడు. ఈ మేరకు అర్జునతో పాటు మరో 10 మంది సంబంధిత స్థలం వద్దకు వెళ్లి పెంటయ్యను కులంపేరుతో ధూషించారు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఆరుగురు వ్యక్తులపై దాడి కేసు..
వంగర: మండల పరిధి అరసాడ గ్రామంలో ఈ నెల 22న జరిగిన ఓ ఫంక్షన్ వద్ద విజయనగరం జిల్లా బలిజిపేట మండలం నారంనాయుడువలస గ్రామానికి చెందిన రాగోలు మధును గాయపరిచిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విశాఖపట్నం ఆరిలోవలో తాత్కాలికంగా ఉంటున్న రాగోలు మధు అరసాడలో జరిగిన ఫంక్షన్కు వచ్చారు. అదే ఫంక్షన్కు హాజరైన మరో ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తలకు తీవ్రగాయాలు కావడంతో రాజాం సీహెచ్సీకి తరలించారు. నిందితులు రాగోలు మధుసూదనరావు బొత్స వేణు, వండాన గణేష్తో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడిపై కూడా ఫిర్యాదు రావడంతో పరస్పరం కేసులు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.