
అంతా డైవర్షన్ పాలిటిక్స్...
మహిళలకు భద్రత కల్పించాలంటూ
అంబేడ్కర్ విగ్రహానికి
వినతిపత్రం అందజేసి
నినదిస్తున్న
మహిళలు
విజయనగరం:
కూటమి ప్రభుత్వంలో రోజుకో అఘాయిత్యం... గంటకో నేరం జరుగుతుండడం ఘోరం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సాగుతున్న పాలనలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయిందంటూ నినదించారు. శాంతియుతమైన విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర వాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత ఆధ్వర్యంలో బాలాజీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి దుప్పాడ సునీత, కార్పొరేటర్ రేగాన రూపాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కెల్ల కృష్ణవేణిలు మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు గతేడాది జూన్ మొదటి వారం నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. మహిళా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం భద్రత కల్పనలోనూ వైఫల్యం చెందిందన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు 1600కు పైగా కేసులు కేవలం మహిళల వేధింపులపై నమోదు కావడమే దీనికి నిదర్శనమన్నారు. హోంశాఖ మంత్రిగా ఓ మహిళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. మహిళలకు భద్రత కల్పనపై కనీసం ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు, రక్షణ కల్పించాల్సిన వారే మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలికను అత్యంత దారుణంగా హత్య చేయటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈనెల 3న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరు రోజుల తరువాత మృతదేహాన్ని గుర్తించడం వారి పని తీరుకు అద్దంపడుతోందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై గత ఆరు నెలలుగా అత్యాచారం చేసిన వారు అధికార మదంతో తప్పించుకు తిరుగుతుంటే పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా...? ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అప్పుడు మహిళా సంక్షేమమన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారమే పరమావధిగా మహిళా లోకానికి మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం నేడు కనీస భద్రత కల్పించకపోవడం ప్రభుత్వం పనితీరును తేటతెల్లం చేస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత పేర్కొన్నారు. తల్లికివందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హమీలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క హమీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను ప్రారంభించి న్యాయం చేస్తే నేటి కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని వాపోయారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్దపెద్ద మాటలు చెప్పి నేడు అదే మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు
రక్షణ కరువు
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
రాష్ట్రంలో అమలవుతున్నది అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. రెడ్ బుక్
రాజ్యాంగం
వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి
గతేడాది ఎన్నికలకు ముందు అమలుసాధ్యంకాని హమీలు గుప్పించి వాటిని అమలు చేయడంలో ఏడాది గడుస్తున్నా నిర్లక్ష్యం నటిస్తున్న ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా వైఎస్సార్సీపీ ముద్రవేసి పబ్బంగడుపుకుంటోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా అమలుకావడం లేదని ఆరోపించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని తప్ప.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదన్నారు. సామాన్య మహిళల పట్లే కాకుండా ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పట్ల కూడా వేధింపులకు పాల్పడుతుండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆశపు సుజాత, పిన్నింటి కళావతి, ఆల్తి సత్యకుమారితో పాటు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతా డైవర్షన్ పాలిటిక్స్...