ఓ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టులో బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయ్యింది. వాస్తవంగా ఐదేళ్లు పూర్తయినా, బదిలీ చేయాలని దరఖాస్తు చేసినా బదిలీ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలి. ఆమె ఎలాంటి అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జి | - | Sakshi
Sakshi News home page

ఓ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టులో బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయ్యింది. వాస్తవంగా ఐదేళ్లు పూర్తయినా, బదిలీ చేయాలని దరఖాస్తు చేసినా బదిలీ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలి. ఆమె ఎలాంటి అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జి

Jun 11 2025 7:46 AM | Updated on Jun 11 2025 7:46 AM

ఓ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయనగరం జిల్లాలోని గరివిడి ప్

ఓ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయనగరం జిల్లాలోని గరివిడి ప్

బదిలీలకు అవకాశం లేకున్నా సరే.. ఏజెన్సీకి కొట్టేశారు!

సూపర్‌వైజర్లకు స్థానచలనం ఉండాలంటే కచ్చితంగా పని చేసే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకోవాలి. లేకుంటే.. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునైనా బదిలీ చేయవచ్చు. ఐసీడీఎస్‌లో అందుకు భిన్నంగా సాగింది. కనీసం రిక్వెస్ట్‌ పెట్టని వారిని ఎనిమిది మంది వరకూ బదిలీ చేశారు. సోమవారం అర్ధరాత్రి వేళ అపాయింట్‌మెంట్‌లు ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టు నుంచి ఒక సూపర్‌వైజర్‌ను బదిలీ అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ప్రాజెక్టుకు విసిరికొట్టేశారు. ఇదే మాదిరి విజయనగరం ప్రాజెక్టు నుంచి మరో సూపర్‌వైజర్‌కు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట ప్రాజెక్టుకు బదిలీ చేశారు. చీపురుపల్లి నుంచి పెదబయలుకు.. గజపతినగరం నుంచి జి.మాడుగల, మరొకరికి హుకుంపేట వేశారు. ఇవన్నీ అధిక శాతం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ప్రాజెక్టులే. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదు. ఆదివారం కొంతమందిని నామమాత్రంగా పిలిచి, కొన్ని ఆప్షన్లు ఇచ్చి మమ అనిపించేశారు. రెండేళ్లు పూర్తి కాని గ్రేడ్‌–2 వారినీ ఏజెన్సీకి బదిలీ చేశారు. వీరిలో ఎవరినీ కౌన్సెలింగ్‌కు కూడా పిలవలేదు. ఉద్యోగ నియామక సమయంలో ఏజెన్సీ ప్రాంతం వేసినా వెళ్లిపోదుమని.. 50 ఏళ్లు దాటాక గిరిజన ప్రాంతాల్లో ఎలా పని చేయగలమని పలువురు వాపోతున్నారు. ఇదే సమయంలో కొంతమందిని ముందు ఏజెన్సీ ప్రాంతానికి వేసి.. తర్వాత మైదాన ప్రాంతానికి పంపారు. జాబితాలు మారడానికి కూడా డబ్బు ప్రభావం చూపిందని వినిపిస్తోంది. ఇందుకు విజయనగరంలోని ఓ ఉద్యోగితోపాటు.. ఆర్జేడీ కార్యాలయంలోని మరో ఉద్యోగి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. గతంలో బదిలీలు కలెక్టర్‌ చేతిలో ఉండేవి. దీన్ని వ్యతిరేకించి మరీ.. మరలా ఆర్జేడీ పరిధిలోకి ఆ శాఖ ఉద్యోగులు తెచ్చుకున్నారు. ఇటువంటి లాబీయింగ్‌ల కోసమే ఇలా చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ మంత్రి సొంత ప్రాంతంలోనే బదిలీలకు పైరవీలు జరగడం గమనార్హం.

ఐసీడీఎస్‌లో

నగదు బదిలీలు!

సీడీపీఓలకు స్థానచలనం

విజయనగరం ఫోర్ట్‌: ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న పలువురు సీడీపీఓలు, 50 మంది సూపర్‌వైజర్లకు బదిలీ అయింది. ఎస్‌.కోట ప్రాజెక్టు సీడీపీఓ ఉమకు రంపచోడవరం, భోగాపురం సీడీపీఓ ఎస్తేరు రాణికి అల్లూరి సీతారామరాజు జిల్లా, భోగాపురం ఏసీడీపీఓ బి.తవిటినాయుడుకు ఐసీడీఎస్‌ పీడీ ఆఫీస్‌ నోడల్‌ అధికారిగా, బాడంగి సీడీపీఓ రాజేశ్వరికి బలిజిపేటకు బదిలీ అయింది.

సాక్షి, పార్వతీపురం మన్యం:

హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియ అత్యంత ‘నగదు’ పారదర్శకంగా చేపట్టారు. అర్హతే ప్రామాణికం అన్న పదాలను పూర్తిగా పక్కనపెట్టి.. డబ్బే పరమావధిగా లెక్క కట్టి నిర్వహించారు. కోరుకున్న వారికి.. కోరుకున్న చోటకు ‘ఆర్డర్స్‌’ ఇచ్చిపడేశారు. నిబంధనల ప్రకా రం.. అసలు బదిలీలకే అవకాశం లేనివారిని ఏకంగా ఏజెన్సీ ప్రాంతాలకు విసిరికొట్టేశారు. నిన్నటి వరకూ ధీమాగా ఉన్న అటువంటి వారంతా.. ఒక్కసారిగా తమ బదిలీ ఉత్తర్వులు చూసి కంగుతిన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కొంతమందిపై గత ప్రభుత్వ ముద్ర వేసి, పూర్తిగా ‘కూటమి’ టీమ్‌ ఉండాలన్న ఉద్దేశంతో మార్పు చేశామని విశాఖ ఆర్‌జేడీ కార్యాలయం నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది.

ఉత్తరాంధ్ర జోనల్‌ పరిధి ప్రాతిపదికగా..

సాధారణ బదిలీల్లో భాగంగా ఐసీడీఎస్‌ ఉత్తరాంధ్ర జోనల్‌ పరిధి ప్రాతిపదికగా ప్రక్రియ చేపట్టారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి కచ్చితంగా బదిలీ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా.. ఐసీడీఎస్‌లో చిత్రవిచిత్రాలు జరిగాయి. ఫలానా చోటకు వెళ్లాలంటే.. ఇంతనీ ఒక రేటు కట్టేసి వసూలు చేసినట్టు సమాచారం. ఎప్పటి నుంచో స్థానచలనం కోసం ఎదురుచూస్తున్న సీడీపీవోలు, సూపర్‌వైజర్లు కాస్త పలుకుబడితోపాటు, అడిగినంత ఇచ్చుకోవడానికీ వెనుకాడలేదు. మొత్తం ప్రక్రియకు విశాఖ ఆర్‌జేడీ కార్యాలయంలో ఒక సీనియర్‌ సహాయకునితో పాటు, విజయనగరం కార్యాలయంలో మరో ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఎక్కువ కాలం విజయనగరం జిల్లాలో పని చేసిన అనుభవం ఉండటం వల్ల తమకున్న పరిచయాలతో మధ్యవర్తిత్వం వహించారు. సీడీపీవోల్లో కాస్త పలుకుబడి ఉన్నవారు.. అధికార పార్టీ విధేయులు తాము కోరుకున్న స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సూపర్‌వైజర్లు సైతం అధికార పార్టీ సిఫారసు లేఖలతో పాటు.. వెళ్లే పోస్టు ప్రాంతాన్ని బట్టి ఒక ‘రేటు’ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలోని ఓ పట్టణ ప్రాజెక్టులో పోస్టు కోసం ఒక సూపర్‌వైజర్‌ సుమారుగా రూ.1.50 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన మండలాల పరిధిలోని ప్రాజెక్టులకూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. విజయనగరంతోపాటు.. భోగాపురం, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాజెక్టుల కోసం బాగా డిమాండ్‌ ఏర్పడింది.

డబ్బులు సమర్పిస్తే కోరుకున్న చోటకు..

మైదాన ప్రాంతం కావాలంటే.. భారీగా ముట్టజెప్పాల్సిందే

నిబంధనలను పక్కనపెట్టి, కొందరిని

గిరిజన ప్రాంతాలకు బదిలీ చేసిన వైనం

ఆర్‌జేడీ కార్యాలయంలో చక్రం తిప్పిన

ఓ ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement