
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
విజయనగరం క్రైమ్: సైబర్ మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తతే ప్రతి ఒక్కరి ఆయుధమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని అలాగే 1930 టోల్ ప్రీ నంబర్కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజల అవగాహన లోపం కారణంగా సైబర్ మోసాలకు గురవుతున్నారన్నారు. సైబర్ మోసగాళ్లు చెప్పే మాయ మాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. సైబర్ మోసాల నియంత్రణలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు లాంటి అంశాలను హ్యాకర్లు లేదా సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వాటి వివరాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులు, అప్లికేషన్లను క్లిక్ చేయవద్దని, ఎవరైనా వ్యక్తిగత సమాచారం ఫోన్ ద్వారా అడిగితే ఇవ్వవద్దని, శంకించ దగిన వెబ్ సైట్లను వినియోగించ వద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు.
ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం
టోల్ ఫ్రీ నంబర్ 1930
ఎస్పీ వకుల్ జిందల్ సూచన