జాతీయ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

జాతీయ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ

May 7 2025 11:20 AM | Updated on May 7 2025 11:30 AM

జాతీయ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ

జాతీయ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ

విజయనగరం: ది గోల్డెన్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ విజయనగరం చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. నగరంలోని విజ్జి స్టేడియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 20 మంది జాతీయ అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విజయనగరం జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభ గల క్రీడాకారులకు విజయనగరం పెట్టింది పేరుగా వాఖ్యానించారు. ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ది గోల్డెన్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ విజయనగరం చారిటబుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు రాధిక మంగిపూడి, ప్రధాన కార్యదర్శి సూర్యలక్ష్మి, ఉపాధ్యక్షులు కేఆర్‌కే రాజు, సహాయ కార్యదర్శి హరిగోపాల్‌, కోశాధికారి రవికుమార్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్‌, వి.ఆనంద కిశోర్‌, పి.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement