
నీట్–2025 పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్–2025 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,548 మంది హాజరు కావాల్సి ఉండగా 1,523 మంది హాజరయ్యారు. పట్టణంలోని జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ప్రాంగణంలోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను, భద్రత, బందోబస్తు తదితరులను పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, పరీక్ష కేంద్రం ఇంచార్జ్ వెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు.

నీట్–2025 పరీక్ష ప్రశాంతం

నీట్–2025 పరీక్ష ప్రశాంతం