హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం

May 3 2025 8:41 AM | Updated on May 3 2025 8:41 AM

హత్యా

హత్యాయత్నం

వైఎస్సార్‌సీపీ వంగర మండల కన్వీనర్‌పై..

వంగర: విజయనగరం జిల్లాలోని వైఎస్సార్‌సీపీ వంగర మండల కన్వీనర్‌, శ్రీహరిపురం ఎంపీటీసీ సభ్యుడు, జెడ్పీటీసీ రాధమ్మ భర్త కరణం సుదర్శనరావుపై శుక్రవారం రాత్రి హత్యాయ త్నం జరిగింది. టీడీపీ గూండాలు కారును అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. డ్రైవర్‌ చాకచక్యంతో కారును ముందుకు తీసుకువెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో వంగర మండలం ఉలిక్కిపడింది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారన్నాయుడువలస–పెదగళావల్లి గ్రామాల మధ్య జరిగిన దాడి ఘటనపై పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరణం సుదర్శనరావు స్వగ్రామం శ్రీహరిపురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ. రాజాం పట్టణంలో నివసిస్తుండడంతో తన కారుపై శుక్రవారం రాత్రి 6.40 గంటలకు పయనమయ్యారు. కింజంగి, గంగాడ, నారన్నాయుడువలస గ్రామం దాటుకొని పెదగళావల్లి వైపు ప్రధాన రోడ్డు వద్దకు రాత్రి 7.20 గంటలకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న తామరచెరువు తుమ్మతోట వద్ద రోడ్డుపై అడ్డంగా పెట్టిన బైక్‌ను తప్పించేందుకు డ్రైవర్‌ కారు వేగాన్ని అదుపు చేశాడు. ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు రాడ్లు, కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశా రు. అనంతరం తనపై దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని సుదర్శనరావు వెల్లడించారు. డ్రైవర్‌ శంకరరావు రోడ్డు మధ్యన ఉన్న బైక్‌ను తప్పించి కారు వేగాన్ని పెంచి సమీపంలోని గళావల్లి గ్రామానికి చేరుకోవడంతో ప్రాణాలు దక్కినట్టు వెల్లడించారు.

తొలుత వంగర పోలీస్‌ స్టేషన్‌కు...

విషయం తెలుసుకున్న ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, సమీపంలో ఉన్న వంగర మండలానికి చెందిన పలు గ్రామాల వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు కరణం సుదర్శనరావుతో సహా వంగర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఘటన తీరును వంగర ఎస్సై షేక్‌శంకర్‌కు వివరించారు. తనను హతమార్చేందుకు శ్రీహరిపురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు పాడి అన్నంనా యుడు, చీమల వాసులు, చీమల గణపతి, పా డి రాంబాబు, చీమల దాలినాయుడు, చీమల గౌరినాయుడు ప్రయత్నించారని, కారును అడ్డగించి దాడి చేశారని, కారు డ్రైవర్‌ చాకచక్యం వల్ల తన ప్రాణాలు దక్కాయని సుదర్శనరావు తెలిపారు. ఇటువంటి ఘటనలు వంగర మండలంలో ఎన్నడూ జరగలేదని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సురేష్‌ముఖర్జీ ఎస్సైను కోరారు. ఉన్నతాధికారులతో ఎస్సై ఫోన్‌లో ట్లాడారు. ఘటన జరిగిన ప్రదేశం పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనిదని, అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు. రాత్రి 10.30 గంటల సమయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకుల సమక్షంలో బలిజిపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరుగురు వ్యక్తులపైన సుదర్శనరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బలిజిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

దారికాచి హతమర్చేందుకు టీడీపీ గూండాలు యత్నం

రోడ్డుకు అడ్డంగా బైక్‌ పెట్టి..

కారును అడ్డుకొని దాడి

కారు అద్దాలు ధ్వంసం

డ్రైవర్‌ చాకచక్యంతో తప్పిన

ప్రాణాపాయం

పార్వతీపురం మన్యం జిల్లా శివారులో ఘటన

బలిజిపేట పోలీసులకు ఫిర్యాదు

హత్యాయత్నం 1
1/2

హత్యాయత్నం

హత్యాయత్నం 2
2/2

హత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement