పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి

May 3 2025 8:39 AM | Updated on May 3 2025 8:41 AM

డీఈఓకు ఉపాధ్యాయ సంఘాల నాయకుల వినతి

విజయనగరం అర్బన్‌: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ బాధ్యతలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకే అప్పగించాలని ఎస్టీయూ, పీఆర్‌టీయూ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. క్లస్టర్‌ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల సత్ఫలితాలు రావన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి.శ్యాం, పీఆర్‌టీయూ పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ రామునాయుడు, ఎస్టీయూ జిల్లా నాయకులు శ్రీనివాసదొర, ఎం.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

ఐరన్‌ సుక్రోజ్‌ వ్యాక్సిన్లతో రక్తహీనత నివారణ

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: రక్తహీనతతో బాధపడే గర్భిణులకు పీహెచ్‌సీల్లో ఐరన్‌ సుక్రోజ్‌ వ్యాక్సిన్‌ వేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నవంబర్‌ 2024 నుంచి మార్చి 2025 మధ్య జరిగిన నాలుగు మాతృ మరణాలు, 15 శిశు మరణాలకు కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ఐరన్‌ మాత్రలతో పాటు ఐరన్‌ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు ప్రతిరోజు తినేలా చూడాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను ప్రసవ తేదీకి ముందే ఆస్పత్రులో చేర్పించాలని సూచించారు. సమావేశంలో డీఐఓ అచ్చుతకుమారి, డీసీహెచ్‌ఎస్‌ ఎన్‌.పి.పద్మశ్రీరాణి, జీవీకే సత్యనారాయణ, ఆర్‌.సుజాత, కిశోర్‌కుమార్‌, అర్బన్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఏసీడీపీఓ బి.తవిటినాయుడు, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌ వినతులపై విచారణ

విజయనగరం అర్బన్‌: సీఎం, డిప్యూటీ సీఎం, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేశ్‌ కార్యాలయం నుంచి వచ్చిన వినతులపై కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ శుక్రవారం తన చాంబర్‌లో విచారణ జరిపించారు. అర్జీదారులను, అధికారులను పిలిపించి ముఖాముఖి విచారణ చేశారు. డెంకాడ మండలం పెదతాడివాడకు చెందిన పొంతపల్లి లక్ష్మి తన భూమిని ఆక్రమించారనే అంశంపై డిప్యూటీ సీఎంకు దరఖాస్తు చేశారు. విచారణ జరపగా తనే ఆ భూమిని అమ్మివేసినట్టుగా రికార్డులో ఉన్నట్టు గుర్తించారు. ఇదే అంశంపై ఆమె ఇప్పటి వరకు 11 సార్లు పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ప్రతిసారి దరఖాస్తు రాయడానికి రూ.500 చెల్లిస్తున్నట్టు ఆమె కలెక్టర్‌కు తెలి పారు. ఆమె వెనుక ఒక లాయర్‌ ఉండి రాయిస్తున్నారని వివరించారు. కలెక్టర్‌ సందిస్తూ దీనిపై సమగ్ర నివేదికను డిప్యూటీ సీఎంకు పంపించాలని డెంకాడ తహసీల్దార్‌కు సూచించారు. అలాగే, వంగర మండలం మడ్డువలస గ్రామానికి చెందిన పడాల సన్యాసిరావు తన 7 ఎకరాల భూమిని రీసర్వేలో వేరొక పేరు మీద రాసేశారన్న ఫిర్యాదుపై విచారణ జరిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, డీపీఓ వెంకటేశ్వరరావు, సర్వే ఏడీ రమణమూర్తి, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు.

పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి 1
1/2

పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి

పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి 2
2/2

పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement