చేపలవేటే జీవనాధారం | - | Sakshi
Sakshi News home page

చేపలవేటే జీవనాధారం

Apr 27 2025 1:17 AM | Updated on Apr 27 2025 1:17 AM

చేపలవేటే జీవనాధారం

చేపలవేటే జీవనాధారం

జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 21 వేలు మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది సముద్రంలో వేట చేస్తుండగా, 15 వేలు మంది వారిపై ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లలో 3,798 మంది మత్స్యకారులు వేట సాగిస్తుండగా మిగతా మత్స్యకారులు ఇతర రాష్ట్రాల బోట్లలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి, నీలగెడ్డపేట, బర్రిపేట, పెద్దూరు, కొత్తూరు, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపేట, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డువెంకటేషుపేట, భోగాపురం మండలం చినకొండ్రాజుపాలెం, పెద కొండ్రాజుపాలెం, చోడిపల్లిపేట, ఎర్రముసలయ్యపాలెం, చోడిపల్లిపేట, ముక్కాం, చేపలు కంచేరు గ్రామాలు ఉన్నాయి. గతేడాది పరిహారం ఎగ్గొట్టడం మత్స్యకారులను నిర్లక్ష్యం చేయడమే అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement