
● రోడ్డు పూర్తిచేయండి ప్లీజ్..!
చిత్రంలో కనిపిస్తున్నది బొబ్బిలి మండలంలోని డొంగురువలస, కొత్తవలస, కేశాయివలస గ్రామాలకు వెళ్లే రోడ్డు. మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.90 లక్షలు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇంతలో అటవీశాఖ అభ్యంతరం తెలపడం, ప్రభుత్వం మారడంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రోడ్డు పనులను కనీసం పట్టించుకోవడంలేదని, అటవీశాఖ అనుమతులు తెచ్చి రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు. అసంపూర్తిగా నిలిచిన రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. – బొబ్బిలిరూరల్