
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి అర్హత సాధించిన క్రీడాకారులు బుధవారం పయనమయ్యారు. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో జరిగే సీనియర్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున విజయనగరానికి చెందిన నలుగురు క్రీడాకారులు కె.అప్పలరాజు, జి.రాధ, కె.పవన్కుమార్, వై.ప్రవల్లికలు పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ మేరకు జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తన కార్యాలయంలో అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య శిక్షకుడు డీవీ చారిప్రసాద్ పాల్గొన్నారు.