చేజారుతున్న ‘బంగారు బాతు’ | - | Sakshi
Sakshi News home page

చేజారుతున్న ‘బంగారు బాతు’

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

వివాదమంతా కొత్తవలస – కిరండూల్‌ (కేకే లైన్‌) చుట్టూనే తిరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, పోర్టుకు తరలించే ఈ మార్గం భారత రైల్వేలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే సెక్షన్లలో ఒకటి. ఈ ఒక్క లైన్‌ ద్వారానే ఏడాదికి సుమారు రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకు వెళ్తోంది. కొత్త జోన్‌ వస్తే ఈ ఆదాయం ఏపీకి చెందుతుందన్న భయంతో, ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలిపించుకుంది. రైల్వే బోర్డు కూడా ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గి, లాభసాటి మార్గాలను అక్కడ ఉంచి.. కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే స్టేషన్లను మాత్రమే ఆంధ్రాకు కేటాయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement