
జీవో 7 ప్రకారం వేతనాలు అమలు చేయాలి..
జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు జీవో 7 ప్రకారం వేతనాలు అమలు చేయాలి. కార్పొరేషన్ తీర్మానం (2024 డిసెంబర్ 11) ప్రకారం వేతనాలు పెంచేందుకు ఐదు నెలల క్రితం ఆప్కాస్ పోర్టల్లో ప్రక్రియ పూర్తై, బిల్లులు కూడా జనరేట్ అయ్యాయి. అయితే, కొన్ని కారణాలతో పాత వేతనాల బిల్లులనే తిరిగి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ విషయంపై 15 రోజుల క్రితం అధికారులు, మేయర్కు ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యాం. – మహాదేవ్ ఆనందరావు, గౌరవ అధ్యక్షుడు,
జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్