ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు

Jun 28 2025 5:26 AM | Updated on Jun 28 2025 7:22 AM

ఇళ్ల

ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు

సంజనకు ‘శోభానాయుడు యువ పురస్కార్‌’

అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ కూచిపూడి నర్తకి సంజనా పుట్టాకు జూలై 4న విశాఖపట్నంలో ‘పద్మశ్రీ

డా. శోభానాయుడు యువ పురస్కార్‌ – 2025’ ప్రదానం చేయనున్నట్లు నటరాజ్‌ మ్యూజిక్‌ – డ్యాన్స్‌ అకాడమీ వ్యవస్థాపకులు బి.ఆర్‌. విక్రమ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని భారతీయ శాసీ్త్రయ నృత్య కళలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి అందజేస్తారు. సంజన 12 సంవత్సరాలుగా గురువు శ్రీలత సూరి శిక్షణలో కూచిపూడి నృత్యంలో సాధన చేసి, అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె 2024లో రంగప్రవేశం పూర్తి చేసి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, ఆస్టిన్‌లో ప్రీ–మెడ్‌ విద్యార్థినిగా ఉన్నారు.

క్యాంపస్‌లో భారతీయ కూచిపూడి నృత్యాన్ని

పరిచయం చేయడంలో

ఆమె విశేష కృషి చేస్తున్నారు.

– మద్దిలపాలెం

మహారాణిపేట : రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ. 3,200 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మంజూరైన 1.89 లక్షల ఇళ్లలో 43 వేలు పూర్తయ్యాయని, మిగిలినవి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీలకు రూ. 1 లక్ష అదనపు సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాణ్యత, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతామని, పనులు వదిలేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.

పేదలందరికీ ఇళ్లు : పేదలందరికీ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే లేఅవుట్లపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం జీవీఎంసీ నుంచి నిధులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీఆర్‌వో భవానీ శంకర్‌, ఆర్డీవో సంగీత్‌, హౌసింగ్‌ సీఈ రామ్మోహన్‌రావు, హౌసింగ్‌ పీడీ సత్తిబాబు, సంబంధిత హౌసింగ్‌ ఈఈలు, డీఈలు, పంచాయతీరాజ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు1
1/1

ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement