సామాజిక కార్యక్రమాలతో గ్రంధి మనోజ్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

సామాజిక కార్యక్రమాలతో గ్రంధి మనోజ్‌ జయంతి

Jun 26 2025 6:06 AM | Updated on Jun 26 2025 6:06 AM

సామాజిక కార్యక్రమాలతో గ్రంధి మనోజ్‌ జయంతి

సామాజిక కార్యక్రమాలతో గ్రంధి మనోజ్‌ జయంతి

విశాఖ సిటీ: మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయలర్స్‌ లిమిటెడ్‌(వైభవ్‌ జ్యుయలర్స్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మనోజ్‌కుమార్‌ గ్రంధి 59వ జయంతి సందర్భంగా పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్‌ రాజా బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా ఉద్యోగులు రక్తదానం చేశారు. ఓమ్నీ ఆర్‌కే ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 250 మందికి, మాక్సీ విజన్‌ ఐ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐ క్యాంప్‌లో 100 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించారు. హెల్త్‌ యూనివర్సిటీ విశ్రాంత వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ రవిరాజ్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రాధ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ చైర్‌పర్సన్‌ భారత మల్లికా రత్నకుమారి గ్రంధి, సంస్థ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఎఫ్‌ఓ సాయి కీర్తన, సీఓఓ రఖాల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింధూరి, వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, కంకటాల టెక్స్‌టైల్స్‌ సంస్థ చైర్మన్‌ మల్లిక్‌, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement