
హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పవన్ కార్తీక్
ఏయూక్యాంపస్: హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (హెచ్ఆర్ఏఏపీ) నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.వి. పవన్ కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జైదీప్ బిశ్వాస్, కోశాధికారిగా ఆర్. వెంకటరావులను ఎన్నుకున్నారు. సలహా మండలి సభ్యుడిగా డాక్టర్ ఎస్. ప్రశాంత్ వ్యవహరిస్తారు. నూతన కార్యవర్గం రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామన్నారు.