అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

Jun 2 2025 1:31 AM | Updated on Jun 2 2025 11:28 AM

పరవాడ: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి లంకెలపాలెం వంతెన వద్ద మృతి చెందినట్లు పరవాడ సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపారు. మృతుడు విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన జి.ధన్‌పాల్‌ బాలాజీ(55)గా గుర్తించామన్నారు. సీఐ తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలేనికి ధన్‌పాల్‌ బాలాజీ ఫార్మాసిటీలో అసిస్టెంట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతిగా మద్యం సేవించి లంకెలపాలెం వంతెన సమీపంలో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. మృతుడి బంధువుల వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచినట్లు సీఐ తెలిపారు. మృతుడి బంధువుల వివరాలు తెలిసిన వారు పరవాడ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement