రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రంగా రేఖవానిపాలెం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రంగా రేఖవానిపాలెం

May 29 2025 1:19 AM | Updated on May 29 2025 1:19 AM

రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రంగా రేఖవానిపాలెం

రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రంగా రేఖవానిపాలెం

తగరపువలస: భీమిలి మండలం రేఖవానిపాలెంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రంగా ఎంపికై ందని జిల్లా పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుధ్య కార్మికులు, కార్యదర్శులు, ఉప మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు ఇక్కడ శిక్షణ ఇస్తామని తెలిపారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో అవగాహన కల్పించారు. రేఖవానిపాలెం, మూలకుద్దు సర్పంచ్‌లు సమ్మిడి శ్రీనివాసరావు, కొయ్య రామకృష్ణారెడ్డి, పంచాయతీ విస్తరణాధికారి కె.రమేష్‌నాయుడు, కార్యదర్శులు ఎన్‌.కె.సిహెచ్‌.వి.ప్రసాద్‌, వైవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement