
మాజీ సీఎం ఎన్టీఆర్కు ఘన నివాళి
మహారాణిపేట: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. బీచ్రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన క్రమశిక్షణ, అంకితభావంతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు మధుసూదనరావు, శేష శైలజ, సీఎంవో నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.