పోర్టులో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పోర్టులో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ప్రారంభం

May 28 2025 5:55 PM | Updated on May 28 2025 5:55 PM

పోర్టులో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ప్రారంభం

పోర్టులో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ప్రారంభం

విశాఖ సిటీ: విశాఖ పోర్టు పరిపాలన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది గ్రీన్‌ ఎనర్జీ, సస్టెయినబుల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటులో కీలకమైన ముందడుగుగా నిలుస్తోందని తెలిపారు. రెండు డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు, రెండు ఏసీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా ఒకేసారి ఆరు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఛార్జ్‌ చేయడం సాధ్యమవుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement