
యాజమాన్య హక్కులు కల్పించాలి
● ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
అనంతగిరి: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బొంరాస్పేట మండలం దుప్చర్ల గ్రామ రైతుల తరఫున కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 200 ఏళ్ల నుంచి పెద్దవాగు సమీపంలో 40 ఎకరాల మిగులు భూమిని నిరుపేద దళితులు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్ తదితరులు పాల్గొన్నారు.