
రైతులకు మేలు చేసేందుకు చర్యలు
నవాబుపేట: పేదలకు, రైతులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాల మినీకిట్స్ (చిరు సంచులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంది సాగును ప్రోత్సహించేదుకు ఉచితంగా కంది విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, టీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య