టైలరింగ్‌ శిక్షణతో ఉపాధి మార్గం | - | Sakshi
Sakshi News home page

టైలరింగ్‌ శిక్షణతో ఉపాధి మార్గం

Jun 23 2025 8:43 PM | Updated on Jun 23 2025 8:43 PM

టైలరి

టైలరింగ్‌ శిక్షణతో ఉపాధి మార్గం

రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి

ధారూరు: ౖటెలరింగ్‌ నేర్పించడం అంటే ఉపాధి చూపినట్లేనని రాష్ట్ర సాగునీటి శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కేరెళ్లి శ్రీసత్యసాయి సార్వజనిక కేంద్రంలో ఆదివారం టైలరింగ్‌ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సత్యసాయి సేవా సంస్థల సేవలతో పేదలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సత్యసాయి సేవా సంస్థల కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, కేరెళ్లి శ్రీసత్యసాయి సార్వజినిక కేంద్రం అధ్యక్షుడు రఘునందన్‌, ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌, కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి, సేవా సంస్థల బాధ్యులు సోమిరెడ్డి, నాగరాజు, బల్వంత్‌రెడ్డి, నర్సింలు, రవి, శ్రీకాంత్‌రెడ్డి మహిళలు పాల్గొన్నారు.

టీఎంహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఖదీర్‌

బంట్వారం: తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి(టీఎంహెచ్‌పీఎస్‌) జిల్లా అధ్యక్షుడిగా తొర్మామిడికి చెందిన ఖదీర్‌ పాషా నియమితులయ్యారు. ఆదివారం పెద్దేముల్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ వహబ్‌ సమక్షంలో ఖదీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖదీర్‌ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనార్టీల హక్కుల సాధన కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం కల్పించిన రిజర్వేషన్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 14శాతం ఉన్న ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ వహబ్‌కు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.

రజకులను ఆదుకోవాలి

రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి

కొడంగల్‌: రజకులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ తమ కులస్తులను ఆదుకోవాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్నారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా రజకుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన రజకుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రతీ గ్రామంలో దోబీఘాట్‌లు, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రవీందర్‌, అశోక్‌, వెంకటేశ్‌, మోహన్‌, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

మరకత శివాలయాన్ని దర్శించుకున్న వెన్నెల

శంకర్‌పల్లి: మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌, గుమ్మడి వెన్నెల గద్దర్‌ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యు లు ఆమెకి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. మరకత శివాలయాన్ని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మళ్లీ సమ యం తీసుకొని వస్తానని, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సదానందం గౌడ్‌, చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, సభ్యులు మోహన్‌, హన్మంతు పాల్గొన్నారు.

టైలరింగ్‌ శిక్షణతో ఉపాధి మార్గం 
1
1/1

టైలరింగ్‌ శిక్షణతో ఉపాధి మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement