
ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం
కుల్కచర్ల: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందని పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, పార్టీ చౌడాపూర్ అధ్యక్షుడు అశోక్కుమార్, ఏఎంసీ చైర్మన్ రామ్మోహన్శర్మ పేర్కొన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండలం చాకల్పల్లి, నీర్సాబ్ తండా, కొత్తపల్లి తండాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించడంతో పాటుగా పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్రెడ్డి, చంద్రశేఖర్, శేఖర్, వెంకటయ్య, విజయకుమార్ పాల్గొన్నారు.
నోట్ పుస్తకాల అందజేత
పరిగి: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన శ్రీశైలం శుక్రవారం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రి అందజేశారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తాను నిరంతరం కృషి చేస్తానని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం
దోమ: మండల పరిధిలోని దిర్సంపల్లి, గుండాల సబ్స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులకు విద్యుత్లో అంతరాయం కల్గుతుందని ఏఈ జి.వినయ్కాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని 132 కేవీ నుంచి రాపోల్లోని 33 కేవీ సబ్స్టేషన్ వరకు చెట్ల కొమ్మలు తొలగింపు జరుగుతున్న కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గుతుందన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని తెలిపారు.
కొడంగల్ను అభివృద్ధి చేయండి
ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బి.గుల్షన్
కొడంగల్ రూరల్: గజ్వేల్, సిరిసిల్ల మాదిరిగా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బి.గుల్షన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొడంగల్లోని అంబేడ్కర్ చౌరస్తా, వినాయక చౌరస్తాలను విస్తరిస్తామని నామమాత్రపు పనులతో చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. శిథిలావస్థకు చేరిన షాదీ ఖానాను నూతనంగా నిర్మిస్తామని నిధులు మంజూరైనట్లు ప్రొసీడింగ్ చూయిస్తూ మభ్యపెడుతున్నారన్నారు. రూ.కోట్లాది మంజూరు చేస్తున్నామంటున్న ప్రభుత్వం కొడంగల్లో అభివృద్ధి మాత్రం కాగితాలకే పరిమితమైందని ఆయన విమర్శించారు.
వెలగని హైమాస్ట్ లైట్లు
దుద్యాల్: హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో మండలంలోని హస్నాబాద్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట స్థానిక గాంధీ చౌక్లో ఉన్న హైమాస్ట్ దీపాలు పనిచేయకపోవడంతో అంధకారం అలుముకుంది. దీంతో దైనందిన కార్యక్రమాలకు అవరోధంగా మారాయి. కారు చీకట్లలో ఏం పనులు చేయాలన్న పెద్ద సమస్యగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్యాంక్ నిండి.. వృథాగా పారి
పూడూరు: మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పూడూరు మండల కేంద్రానికి వెళ్లే రోడ్డులో ఉన్న ట్యాంకు నిండి తరచూ నీరు రోడ్డుపైనే పారుతుంది. కుళాయిల్లో నీరు రాక ఇబ్బందులు పడుతూ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఈ రోడ్డుపై నుంచి వెళ్లే అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పట్టించుకుని కాలనీకి నీరు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం