
టీబీ ముక్త్ అభియాన్ను వినియోగించుకోవాలి
కొడంగల్ రూరల్: టీబీ ముక్త్ అభియాన్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు బుస్రా సూచించారు. శుక్రవారం పట్టణంలోని వడ్డెరగల్లీ కాలనీలో నిర్వహించిన క్యాంపులో ఆమె సలహాలు, సూచనలు అందించారు. షుగర్, బీపీ, క్యాన్సర్ వచ్చినవారు, పాత టీబీ పేషంట్లు, కుటుంబసభ్యులు, పొగాకు తాగేవారి నుంచి శాంపిల్స్ తీసుకున్నామన్నారు. మొత్తం 110మంది స్క్రీన్ చేసి 38మందికి ఎక్స్రే చేశామన్నారు. దీంట్లో టీబీ పాజిటివ్ వచ్చిన వారికి 6 నెలలపాటు ఉచితంగా మందులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీ డాక్టర్ అమృత, హెల్త్ అసిస్టెంట్ మధు, టీబీ సూపర్వైజర్లు రాహత్అలీ, సుశీల, ఏఎన్ఎం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.