
పోలేపల్లికి పోటెత్తిన భక్తులు
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లిలో స్వయంభూగా వెలిసిన రేణుక ఎల్లమ్మ దేవాలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన జనాలు అమ్మవారికి బోనాలు, కోడి పుంజులు, మేకపోతులతో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజులలో అమ్మవారిని దాదాపు ఐదు వేలకు పైగా మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు ఆలయ ఈవో రాజేందర్రెడ్డి తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు నిండిపోయారు.