
బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం
తాండూరు: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనులకు రాజ్యాధికారం సాకారమవుతోందని ఈ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని చంద్రశేఖర్ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ సెంట్రల్ కో ఆర్డినేటర్ దాగిల్లా దయానందరావు, విశిష్ట అఽతిథులుగా లింగంపల్లి యాదగిరిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలలో ఒక సామాజిక వర్గం మాత్రమే ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. తాండూరు నియోజకవర్గంలో బహుజనుల సంఖ్య 70 శాతం ఉప్పటికి విద్యా, ఉద్యోగం, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనుల హక్కులు అందుతాయన్నారు. అందుకు కార్యకర్తలు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జగన్, సయ్యద్అమీర్, ప్రభుకుమార్, బాల్రాజ్, అమ్జద్అలీ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ముదిరాజ్