
కేంద్ర పథకాలను ప్రచారం చేయండి
దోమ: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చి నేరుగా అందిస్తున్నారని తెలిపారు. ఉచిత రేషన్ బియ్యం, ఆయుష్మాన్ భారత్, రైతులకు మద్దతు ధర, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్బీమా యోజన తదితర వాటిని అందిస్తుందన్నారు. కార్యకర్తలు సమష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.