
పాపం పసి పాప
దౌల్తాబాద్: కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న చిన్నారి గొంతులో మెంతో ప్లస్ ప్లాస్టిక్ బిల్ల ఇరుక్కుని, ఊపిరాడక చనిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని ఈర్లపల్లికి చెందిన ముశ్రీఫాబందెప్ప, కళ్యాణి దంపతులు బుధవారం రాత్రి తమ తొమ్మిది నెలల చిన్నారి జ్ఞానేశ్వరితో కలిసి నిద్రించారు. ఈ సమయంలో చిన్నారి చేతికి తగిలిన మెంతోప్లస్ బిల్లను నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుంది. పాప ఏడుపు వినిపించడంతో మేల్కొన్న తల్లిదండ్రులు.. గొంతులో ఇరుక్కుపోయిన బిల్లను చేతులతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది.
చిన్నారి గొంతులో ఇరుక్కున్న మెంతోప్లస్ ప్లాస్టిక్ బిల్ల
ఊపిరాడక మృతి