అర్హులందరకీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరకీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 19 2025 7:56 AM | Updated on Jun 19 2025 7:56 AM

అర్హులందరకీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరకీ ఇందిరమ్మ ఇళ్లు

ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి

పరిగి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ సంకల్పమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.84 లక్షలతో బాలసదనం భవనం ప్రారంభించి మాట్లాడారు. రూ.25 కోట్లతో సీసీ రోడ్లు పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, కుల్కచర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులుముదిరాజ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు లాల్‌కృష్ణ, హన్మంతు, ఆయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement