
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ మండల అధ్యక్షురాలు అనసూయ
పరిగి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ సూచించారు. బుధవారం మండల పరిధిలోని గడిసింగాపూర్, రూప్ఖాన్పేట్ గ్రామాల్లో బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్లలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలో భాగంగా ప్రపంచ దేశాలకు సవాలు విసురుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్డు, ఇతర పనులు మొత్తం కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యంతో సింహభాగం కేంద్రానిదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాముయాదవ్, నాయకులు రమేష్, వీరేష్, అశోక్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.