
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి
మోమిన్పేట: ధరణి తప్పిదాతలను సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దేవరంపల్లి, ఏన్కతల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు దరఖాస్తులు చేసుకుంటే అధికారులు రికార్డులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్ కుమార్, ఆర్ఐలు గోవర్ధన్, సరిత, కార్యదర్శి నర్సింలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
భూ భారతితో రైతులకు మేలు
కుల్కచర్ల: భూ భారతి రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు చేకూరుతుందని కుల్కచర్ల తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బొంరెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా పెండింగ్ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల మేలుకోసం నిర్విరామంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిర్దవరి రవి, ఖాజా రెవెన్యూ సిబ్బంది అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు స్వీకరించిన తహసీల్దార్
పరిగి: భూ భారతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తహసీల్దార్ ఆనంద్రావు సూచించారు. సోమవారం మండల పరిధిలోని గడిసింగాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరేందర్, పంచాయతీ కార్యదర్శి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.