లగచర్లలో ప్రశాంతంగా రెవెన్యూ సదస్సు | - | Sakshi
Sakshi News home page

లగచర్లలో ప్రశాంతంగా రెవెన్యూ సదస్సు

Jun 17 2025 6:59 AM | Updated on Jun 17 2025 6:59 AM

లగచర్లలో ప్రశాంతంగా రెవెన్యూ సదస్సు

లగచర్లలో ప్రశాంతంగా రెవెన్యూ సదస్సు

దుద్యాల్‌: మండల పరిధిలోని లగచర్లలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు ప్రశాంతంగా కొనసాగిందని తహసీల్దార్‌ కిషన్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. రైతు సమస్యల పరిష్కరించుకునేందుకు గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు చక్కని స్పందన లభిస్తోందన్నారు. రెవెన్యూ సదస్సులో 31 ఫిర్యాదులు అందినట్లు ఉప తహసీల్దార్‌ వీరేశ్‌ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌ కుమార్‌, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఫకీరప్ప, ఊషప్ప, లాలాప్ప, పంచాయతీ కార్యదర్శి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement